ధరణిలో అర్జీల ఆప్షన్ డిలీట్

ధరణిలో అర్జీల ఆప్షన్ డిలీట్
  • 20 రోజులకే తొలగించిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ లో అర్జీలు పెట్టుకునేందుకు ఉన్న ఆప్షన్ డిలీట్ అయింది. భూముల గట్లు, విస్తీర్ణం, అటవీ సరిహద్దు వివాదాలు, పట్టాదారు పాస్ బుక్ సమస్యల పరిష్కారానికి ధరణి లో అప్లై చేసుకునేందుకు పెట్టిన ఆప్షన్ ను ప్రభుత్వం తొలగించింది. ‘అప్లికేషన్​ఫర్​ ల్యాండ్ మ్యాటర్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆప్షన్​ ద్వారా బాధితులు నేరుగా కలెక్టర్‌‌కు అర్జీ పెట్టుకునేందుకు చాన్స్ ఉండేది. జనవరి 20న అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్ ద్వారా వేలాది మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారు. 20 రోజులు తిరగకుండానే ఈ ఆప్షన్‌ను సర్కార్ తొలగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బాధిత రైతులు రోజూ కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. ధరణి పోర్టల్ లో ‘గ్రీవెన్స్​రిక్వెస్ట్’ అనే ఆప్షన్ కూడా నెల రోజుల కింద పెట్టారు. కానీ పెట్టినప్పటి నుంచీ ఈ ఆప్షన్ పని చేస్తలేదు. దీనిపై క్లిక్​చేస్తే ‘నో రికార్డ్స్​ఫౌండ్’ అని చూపిస్తోంది.

ఇవి కూడా చదవండి..

అచ్చంపేట టు హైదరాబాద్​..  రేవంత్​ పాదయాత్ర

మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ జైలుకే

మూడు నెలల సదువులకు ఏడాది ఫీజు కట్టాల్నట

గవర్నర్ లెటర్​తో సర్కారులో కదలిక