హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయంపై ఇప్పటికే అర్హతలను నిర్ణయించిన బీసీ సంక్షేమ శాఖ.. తాజాగా మరికొన్ని అర్హతలనూ జోడించింది. బుధవారం మంత్రి గంగుల కమలాకర్ చేసిన రివ్యూలో కలెక్టర్లు పలు అనుమానాలను వ్యక్తం చేయడంతో వాటిని నివృత్తి చేస్తూ.. మెమోను విడుదల చేసింది. కల్యాణలక్ష్మి లబ్ధిదారులు కూడా ఈ స్కీంలో అర్హులేనని వెల్లడించింది. దరఖాస్తుకు గడువు చాలా తక్కువ ఉన్నందునా.. ఇన్కమ్ సర్టిఫికెట్పాతదైనా ఫర్వాలేదని తెలిపింది. 2021 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న అన్ని ఇన్కమ్ సర్టిఫికెట్లను ఆమోదిస్తామని తెలిపింది. ఒక్క కుటుంబంలో ఒక్కరే ఆర్థిక సాయానికి అర్హులని మెమోలో బీసీ సంక్షేమ శాఖ పేర్కొంది.