
తెలంగాణలో హోంగార్డులకు గౌరవ వేతనం పెరిగింది. 30 శాతం గౌరవవేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది హోంశాఖ. పెరిగిన వేతనాలు 2021 జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను మూడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించింది ప్రభుత్వం. లేటెస్ట్ గా వీటికి సంబంధించి స్పష్టతనిస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది.
మరిన్ని వార్తల కోసం