
సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉంటుందనుకున్నారు. ఎందుకంటే.. చాలా రోజుల క్రితమే జనవరి 7న RRR,12న పవన్ భీమ్లానాయక్,13న మహేశ్ సర్కారు వారి పాట, 14న ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ డేట్లను ప్రకటించారు. పాన్ ఇండియా మూవీలు రిలీజ్ అవుతుండటంతో కొన్ని రోజుల క్రితం సర్కారు వారి పాట మూవీని సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. లేటెస్ట్ గా రేసు నుంచి పవన్ భీమ్లానాయక్ తప్పుకోవడంతో సంక్రాంతి రేసులో RRR, రాధేశ్యామ్ మాత్రమే ఉన్నాయి. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి .. అలాగే ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న ఎఫ్ 3ని ఏప్రిల్ 29కు వాయిదా వేశారు.
థియేటర్ల సమస్య, భారీ బడ్జెట్ సినిమాలు కావడం వంటి సమస్యలతో నిర్మాతల మధ్య సయోధ్యతో వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి పవన్, మహేశ్ లకు, భీమ్లానాయక్, సర్కారువారి పాట, ఎఫ్ 3 నిర్మాతలకు తన ట్విట్టర్లో థ్యాంక్స్ చెప్పారు. భీమ్లా నాయక్ వాయిదా వేయాలని చిన్నబాబు, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు, టీం మొత్తానికి కృతజ్ఞతలు. అలాగే సంక్రాంతికి ఫర్ఫెక్ట్ పొంగల్ మూవీ అయిన సర్కారు వారీ పాటను సమ్మర్ కు వాయిదా వేసి ఇండస్ట్రీలో మంచి వాతావరణాన్ని సృష్టించిన నా హీరో మహేశ్ బాబుకు, మూవీ టీంకు ధన్యవాదాలు. అలాగే తమ సినిమా విడుదలను మార్చినందుకు దిల్ రాజు కు F3మూవీ టీమ్కి ధన్యవాదాలు చెప్పారు రాజమౌళి.
The decision by Chinababu garu and Pawan Kalyan garu to defer the release date of #BheemlaNayak is well appreciated. Wishing the team all the very best…:)
— rajamouli ss (@ssrajamouli) December 21, 2021
.@urstrulyMahesh was the one who took the initative in decluttering the Pongal releases... Even though #SarkaruVaariPaata was a perfect Pongal film, he moved it to summer and created a healthy atmosphere. Thanks to my Hero ? and also to the entire team at @MythriOfficial…
— rajamouli ss (@ssrajamouli) December 21, 2021