మహబూబ్నగర్, వెలుగు: తెలంగాణ, కర్నాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన కొల్పూరు-, కుర్తికొండ బ్రిడ్జ్ కమ్ బరాజ్ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తయ్యేలా కర్నాటక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆ రాష్ట్ర మాజీ మంత్రి బోసురాజును మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.
మంగళవారం ఆయన రాయచూర్లో బోసురాజుతో భేటీ అయ్యారు. ఈ బ్రిడ్జ్ కమ్ బరాజ్ నిర్మిస్తే రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. ఒకటిన్నర టీఎంసీ కెపాసిటీ గల ఈ బరాజ్ తో సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని అన్నారు.
