కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నప్పుడు చాలా మంది పిల్లలు గారాబంగా పెరుగుతారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు. పిల్లలను కొందరు తల్లిదండ్రులు ఎలా అదుపులో పెట్టారో చెప్పారు. ఈ నేపథ్యంలోనే చిన్నప్పుడు తాను ఎలా పెరిగింది. వాళ్ల అమ్మ తనను ఏవిధంగా పెంచిందో చెప్పారు. "నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లలేదు. మా అమ్మ ఒక్క చెంప దెబ్బతో నా కళ్లు తెరిపించింది. నా ఆలోచనలను అన్నింటిని పూర్తిగా మార్చేసింది’. అని ఉన్న ఇమేజ్ ను స్మృతి ఇరానీ షేర్ చేశారు. ఈ ఇమేజ్ ను తనకు తన తల్లి పంపిందని పోస్ట్లో వెల్లడించారు. "మా అమ్మ సంతోషంగా దీన్ని నాతో పంచుకుంది ... తనలా ఒక్క దెబ్బతో మారిన వారెవరో చెయ్యి ఎత్తాలంటూ పోస్ట్ చేశారు. అమ్మా ఐ లవ్యూ అంటూ ముగించారు. ఈ కామెంట్ ను దాదాపు 37 వేల మంది లైక్ చేశారు.
మరిన్ని వార్తల కోసం
ఎన్నికల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కేసీఆర్ కు కోమటిరెడ్డి హెచ్చరిక
పండుగల కంటే ప్రాణాలే ముఖ్యం