- ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి
హైదరాబాద్, వెలుగు: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆ పాలసీలో కొన్ని సమస్యలున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. 21వ శతాబ్దానికి అవసరమైన విధానాలతో ఆ పాలసీని రూపొందించారని ఆయన చెప్పారు.
శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ‘నూతన విద్యా విధానం–అమలు’ పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లింబాద్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొత్త విద్యా విధానంతో ప్రైవేటు యూనివర్సిటీల విషయంలో సమస్యలు వస్తాయన్నారు. విదేశీ వర్సిటీల రాకతో పేద విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

