జేఎల్ ఎగ్జామ్ ఫైనల్ కీ రిలీజ్

జేఎల్ ఎగ్జామ్ ఫైనల్ కీ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎగ్జామ్ ఫైనల్ కీని టీఎస్​పీఎస్సీ  సోమ వారం రిలీజ్ చేసింది. ఎక్స్ పర్ట్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ ‘కీ’ని ప్రకటి స్తున్నట్టు కమిషన్  తెలిపింది. కమిషన్ వెబ్ సైట్ లో కీ చూసుకోవాలని అభ్యర్థు లకు సూచించింది. రాష్ట్రంలో సర్కారు జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,392 జేఎల్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

గతేడాది సెప్టెంబర్12 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్ లైన్​లో పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత వారంలోనే ప్రిలిమినరీ కీని టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి అభ్యంత రాలను స్వీకరించిన కమిషన్.. ఫైనల్ కీ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసింది. అభ్య ర్థుల ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత సోమవారం ఫైనల్ కీ ని టీఎస్​పీఎస్సీ తన వెబ్ సైట్​లో పెట్టింది.