సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే ఓ శుభవార్త

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే ఓ  శుభవార్త

హైదరాబాద్‌‌, వెలుగు : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్‌‌ఆర్టీసీ గుడ్‌‌ న్యూస్‌‌ చెప్పింది. స్పెషల్‌‌ బస్సులకు ఈసారి కూడా అడిషనల్‌‌ చార్జీలు వసూలు చేయడం లేదని ప్రకటించింది. ఈ సంక్రాంతికి మొత్తం 3,800 స్పెషల్‌‌ బస్సులను వివిధ రాష్ట్రాలకు ఆర్టీసీ తిప్పనుంది. జనవరి రెండో వారం నుంచి వారం రోజులు స్పెషల్‌‌ బస్సులను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది దసరా పండుగ సమయంలోనూ అడిషనల్‌‌ చార్జీలను ఎత్తేశారు. సంక్రాంతికి మన రాష్ట్రం నుంచి ఏపీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఇందులో అధిక శాతం బస్సులు ఏపీకే కేటాయించారు. ఇప్పటికే ఆన్‌‌లైన్‌‌ రిజర్వేషన్లు ఓపెన్‌‌ అయ్యాయి. కాగా, ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ మాత్రం మాత్రం టికెట్‌‌ రేట్లను విపరీతంగా పెంచేశాయి.