తిరుమల తిరుపతి స్వామి వారికి ఏప్రిల్లో జరిగే విశేష ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) జనవరి 3న(శుక్రవారం) ఆన్లైన్లో విడుదల చేసింది. ఇవాళ ఉదయం 10 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలక్ట్రానిక్ లాటరీ విధానంలో భక్తులను TTD ఎంపిక చేస్తుంది.
65,280 ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది TTD. ఆన్లైన్ డిప్ విధానంలో 10,680 సేవా టికెట్లు, ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 54,600 సేవా టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి.