వచ్చే వారం నుండి భక్తులకు ఆన్ లైన్ వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు
తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు ప్రయోగాత్మకంగా ప్రారంభించింది టీటీడీ. కోవిడ్-19 నిబంధనల మేరకు శ్రీవారి ఆర్జిత సేవలను టిటిడి ఏకాంతంగా నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్లైన్ వర్చ్యువల్ సేవగా ప్రారంభించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల రెండో వారం నుండి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టిటిడి సన్నాహాలు చేస్తోంది. ఈ సేవలు పొందిన భక్తులకు ఆ టికెట్టుపై శ్రీవారి దర్శనం ఉండదు. శ్రీవారి దర్శనం కొరకు ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్ లైన్ లో తీసుకోవలసి ఉంటుంది. ఆలయంలో ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.