నిర్లక్ష్యానికి ఇద్దరు బాలురు బలి

నిర్లక్ష్యానికి ఇద్దరు బాలురు బలి

హైదరాబాద్‌: నిర్లక్ష్యం ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది. సెల్లార్ గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఉప్పల్‌ భగాయత్‌ వెంచర్‌ ప్రాంతంలో భవన నిర్మాణం కోసం సెల్లార్ గుంత తవ్వారు. ఈ ఉదయం క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన బాలురు సెల్లార్‌ గుంతలో పడి మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతులు రేవంత్‌(12), చింటూ(11)గా గుర్తించారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం గాంధీ హస్పిటల్ కి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి యజమాని నిర్లక్ష్యంతోనే ఈ విషాద సంఘటన జరిగిందని తెలిపారు స్థానికులు.