హైదరాబాద్: లిప్టులో ఇరుక్కుపోయిన ఇద్దరు అన్నదముల్ని అసెంబ్లీ అగ్ని మాపక సిబ్బంది కాపాడారు. నాంపల్లిలోని అలీసా మహేక్ అపార్ట్ మెంట్ లోని లిఫ్టులో మొహ్మద్ ఖాసీనుల్లాహ్ అనే 3 సంవత్సరాల బాలుడితో పాటు అతడి అన్న ఇరుక్కుపోయారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటనతో భయపడిపోయిన వారి కుటుంబ సభ్యులు వెంటనే అగ్ని మాపక సిబ్బంది సమాచారమిచ్చారు. సమయానికి ఆ అపార్ట్ మెంట్ చేరుకున్న సిబ్బంది కోబర్ సహాయంతో లిఫ్ట్ తెరచి ఇద్దరి పిల్లల్ని కాపాడారు.
ప్రాణాపాయం నుంచి తమ ఇద్దరి పిల్లలు బయటపడడంతో వారు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.వారి ప్రాణాలను కాపాడిన అగ్ని మాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.