రూ. 3.53 కోట్ల స్వాధీనం!

రూ. 3.53 కోట్ల స్వాధీనం!

భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు :జిల్లాలోని పలు అంతర్రాష్ట్ర చెక్​ పోస్టులను ఎస్పీ బి. రోహిత్​ రాజు మంగళవారం పరిశీలించారు. జిల్లాలోని పెనగడప, మందలపల్లి, అల్లిపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లోని చెక్​ పోస్టులను సందర్శించిన ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్​అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 3.53కోట్ల మేర స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో 12 అంతర్రాష్ట్ర, నాలుగు అంతర్​ జిల్లా చెక్​ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. చెక్​ పోస్టుల వద్ద మరింత పటిష్టంగా బందోబస్తు నిర్వహించాలన్నారు. ఆయన వెంట పాల్వంచ డీఎస్పీ సతీశ్​కుమార్​తో పాటు సీఐలు, ఎస్సైలు ఉన్నారు.