భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా అడవుల్లో మంగళవారం భద్రతాబలగాలు మావోయిస్టుల డంప్ను స్వాధీనం చేసుకున్నాయి. బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోద్రాజ్పదర్ అడవుల్లో సీఆర్పీఎఫ్ 50వ బెటాలియన్ బలగాలు, బెజ్జి పోలీసులు కలిసి తనిఖీలుచేపట్టారు. సరెండర్ అయిన నక్సల్స్ ఇచ్చిన సమాచారం మేరకు భూమిలో దాచిపెట్టిన డంప్ను వెలికితీశారు.
ఒక 315 బోర్ బోల్ట్ యాక్షన్ రైఫిల్, వివిధ తుపాకుల్లో వాడే తూటాలు, అల్యూమినియం పాత్రలు దొరికాయి. పేలుడు పదార్థాలతో పాటు విప్లవసాహిత్యం స్వాధీనం చేసుకొని బెజ్జి పోలీస్స్టేషన్కు తరలించారు.
