బాల్​ కోసం వెళ్తే ప్రాణం పోయింది

బాల్​ కోసం వెళ్తే  ప్రాణం పోయింది

    పిల్లరు గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ఉప్పల్, వెలుగు: క్రికెట్ బంతి కోసం పిల్లర్ గుంతలోకి దిగిన ఇద్దరు బాలలు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన హైదరాబాద్​లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉప్పల్ హెచ్ఎండీఏ లేఅవుట్లో క్రికెట్ ఆడేందుకు శాంతినగర్‌‌కు చెందిన చిన్నారులు నలుగురు వెళ్లారు. ఆడుకుంటుండగా బాల్​సమీపంలో ఇటీవలే తీసిన పిల్లర్ గుంతలో పడింది. గుంత చుట్టూ కట్టెలతో అడ్డుగా పెట్టారు. అయితే బంతి కోసం పల్లెపు రేవంత్(14), పోలెపల్లి మనోహర్(14) గుంతలోకి దిగారు. గుంత లోతుగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ హాస్పిటల్ కు తరలించారు.