ఇద్దరు అమ్మాయిలపై కత్తితో దాడి చేసి.. బాలుడి ఆత్మహత్య

ఇద్దరు అమ్మాయిలపై కత్తితో దాడి చేసి.. బాలుడి ఆత్మహత్య
  • హైదరాబాద్​లోని అంబర్​పేటలో ఘటన
  • ప్రేమ పేరుతో బాలికను వేధించిన బాలుడు
  • బర్త్ డే కేక్ కటింగ్​కు రావాలని సతాయింపు
  • నిరాకరించడంతో బాలిక, ఆమె సోదరిపై దాడి  
  • భయంతో పారిపోయి రైలు కింద పడి సూసైడ్

సికింద్రాబాద్, వెలుగు: ప్రేమ పేరుతో  కొన్ని రోజులుగా ఓ బాలిక(17)ను ఓ బాలుడు (17) వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తన బర్త్ డే ఉందని, కేక్ కటింగ్ కు రావాలని వెంటపడ్డాడు. అయితే ఆ బాలిక నిరాకరించడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన బాలిక సోదరిపైనా దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు అమ్మాయిలు గాయపడడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత భయంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని అంబర్ పేటలో జరిగింది.  

ట్యూషన్​కు వెళ్లగా వెంబడించి..

బాగ్​అంబర్​పేటలోని తురాబ్​నగర్​లో ​బాలిక ఫ్యామిలీ ఉంటోంది. జనగామకు చెందిన బాలుడి కుటుంబం కూడా అదే ఏరియాలో ఉంటోంది. వీళ్లిద్దరూ ఒకే స్కూ ల్​లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం వేర్వేరు కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంట బాలుడు పడుతున్నాడు. ఆమె నిరాకరించినా మెసేజ్​లు చేయడంతో పాటు వెంటపడి వేధిస్తున్నాడు. రోజూ కాలేజీ అయిపోయినంక బాలిక తన పెద్దమ్మ బిడ్డ దగ్గరికి ట్యూషన్​ కోసం వెళ్తున్నది. ఈ క్రమంలో బాలిక గురువారం ట్యూషన్​కు వెళ్లింది. ఇది చూసిన బాలుడు..  ఆమె వెంటపడ్డాడు. తన బర్త్ డే ఉందని, కేక్ కటింగ్ కు రావాలని కోరాడు. అయితే తాను రానని చెప్పి బాలి క వెళ్లిపోయింది. రాత్రి 7:30 గంటల సమయంలో బాలిక ట్యూషన్​లో ఉండగా.. బాలుడు అక్కడికి వెళ్లి కేక్ కటింగ్​కు రావాలంటూ ఆమెతో గొడవ పడ్డాడు. బాలిక నిరాకరించడంతో అప్పటికే తన వెంటతెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డొచ్చిన బాలిక పెద్దమ్మ కూతురుపైనా దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన ఇద్దరు అమ్మాయిలను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించా రు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు.

భయంతో సూసైడ్..

బాలుడిపై బాధిత కుటుంబ సభ్యుల  ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పటికే భయాందోళనకు గురైన బాలు డు..  ఎక్కడికో పారిపోయాడు. కత్తితో పొడవడంతో అమ్మాయిలకు ఏమైనా అవుతుందేమోనని భయపడ్డ బాలుడు.. గురువారం అర్ధరాత్రి 2 గంటల టైమ్​లో విద్యానగర్, -జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ల మధ్య పట్టా లపై అడ్డంగా పడుకుని సూసైడ్​ చేసుకున్నాడు. రైలు పట్టాలపై తల, మొండెం వేరుగా పడి ఉన్న డెడ్​బాడీని గుర్తించిన రైల్వే పోలీసులు.. అంబర్​పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్​కు చేరుకుని డెడ్​బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.