ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. గోంపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా మిగిలిన వారు పరారయ్యారు. మృతుల్లో కొంటా ఏరియా కమాండ్‌ కవాసి హుంగా కూడా ఉన్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పరారైన మావోల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సుక్మా జిల్లా ఎస్పీ సునీల్‌ శర్మ తెలిపారు.