ఇద్దరు సర్కార్ డాక్టర్ల రాజీనామా

ఇద్దరు సర్కార్ డాక్టర్ల రాజీనామా

భద్రాచలం ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో కరోనా భయం
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు రాజీనామా చేశారు. ఐసోలేషన్ వార్డు ఇంచార్జీగా వ్యవహరిస్తున్న డాక్టర్ కిషన్, మరో డాక్టర్ నాగేశ్వరరావు రాజీనామా చేశారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చావా యుగంధర్ శుక్రవారం వెల్లడించారు. కరోనా విపరీతంగా వ్యాపిస్తున్నందున డాక్టర్లు భయపడుతున్నారని ఆయన చెప్పారు. అయితే వారి రాజీనామాలను ఆమోదించకుండా అధికారులు బుజ్జగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రిలో ఇద్దరు కరోనాతో చనిపోయారు. దీంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇక శుక్రవారం భద్రాచలంలో మరో15 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.