ముషీరాబాద్, వెలుగు : సికింద్రాబాద్ దోమలగూడ రోజ్ కాలనీలో ఈ నెల 11న గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగమణి (38), విహాన్ (3) ఆదివారం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 6కు చేరింది. ఇదే ఘటనలో తీవ్ర గాయాలతో ఆనంద్ (41) గాంధీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. విహాన్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ధనలక్ష్మి తో పాటు ముగ్గురు పిల్లలు శరణ్య, అభినవ్, విహాన్, ధనలక్ష్మి తల్లి పద్మ, ఆమె చెల్లెలు నాగమణి మృతి చెందారు.
ALSO READ :జులై 20న కొల్లాపూర్లో ప్రియాంక గాంధీ సభ వాయిదా..