తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

న్యూఢిల్లీ, వెలుగు :  రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు రానున్నారు. మధ్యప్రదేశ్, కోల్ కతా హైకోర్టుల నుంచి ఇద్దరు జడ్జీలను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, కోల్​కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ మౌషుమీ భట్టాచార్యను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు అనుగుణంగా ఈ బదిలీలు జరిగాయి.