కేబినెట్ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. అవేంటంటే..

కేబినెట్ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. అవేంటంటే..

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ సమావేశంలో మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బళ్లారి-గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బళ్లారి-గుంతకల్లు మధ్య 46 కిలో మీటర్ల రైల్వే లైన్తో పాటు.. రూ.1,264 కోట్లతో మూడు, నాలుగో రైల్వే లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బళ్లారి-గుంతకల్లు మధ్య అదనపు లైన్లతో ఏపీ, కర్ణాటకకు ప్రయోజనం చేకూరనుంది.

వేదవతి నది దగ్గర పెద్ద వంతెన నిర్మించనున్నట్లు కేంద్ర కేబినెట్ తెలిపింది. భవ్య రసాయన్‌ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 3 వేల 30 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. మూడు డెడికేటెడ్‌ కెమికల్‌ పార్కులు ఏర్పాటు చేస్తామని -కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.