కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదు

కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదు

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు అన్నారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.  విజయవాడ ఇందిరాగాంధీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి 30 జాతీయ రహదారి ప్రాజెక్టులకు  శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అన్నారు నితిన్‌ గడ్కరీ. ఇక్కడ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎంతో కీలకమైనవి అన్నారు. వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక్కడి అభివృద్ధిలో పోర్టులది కీలక పాత్ర అన్నారు. గ్రామాల అనుసంధానతకు వాజ్‌పేయీ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. దేశాభివృద్ధికి గ్రామాల అనుసంధానం ఎంతో కీలకం అని వాజ్‌పేయీ భావించారన్నారు

అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదన్నారు నితిన్ గడ్కరీ. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లను కేటాయిస్తామన్నారు. ఏపీలో 3 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామన్నారు. 2024లోగా రాయ్‌పూర్‌-విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నాగ్‌పూర్‌-విజయవాడ, బెంగళూరు-చెన్నై మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తామన్నారు. రూ.5వేల కోట్లతో చిత్తూరు-తంజావూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేని పూర్తి చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి: 

మంత్రి హరీష్రావుకు రఘునందన్ సవాల్

కేసీఆర్ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి