తన మర్డర్‌ను తానే వీడియో తీసుకున్న వ్యక్తి

తన మర్డర్‌ను తానే వీడియో తీసుకున్న వ్యక్తి

ఉత్తరప్రదేశ్‌లో ఊహించని ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన మర్డర్‌ను తానే వీడియో తీసుకున్నాడు. అలా వీడియో తీస్తూనే క్షణాల్లో నేలకొరిగాడు. ముజఫర్ నగర్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియో ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు వాటర్ ట్యాంక్ మీద కూర్చొని మందు తాగుతున్నారు. వారిలో ఒక వ్యక్తికి మేనల్లుడైన 19 ఏళ్ల ప్రిన్స్ వీడియో తీస్తున్నాడు. అంతలో మామ తన పక్కనున్న పిస్టల్‌ను తీసి బుల్లెట్ లోడ్ చేశాడు. ఆ తర్వాత వీడియో తీస్తున్న మేనల్లుడిపై కాల్చాడు. అంతే అప్పటివరకు వీడియో తీస్తున్న ప్రిన్స్ కుప్పకూలాడు. అప్పడు కూడా ఫోన్ అతని చేతిలోనే ఉంది. ప్రిన్స్ కిందపడే వరకు వీడియో రికార్డ్ అయింది.

వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. బాధితుడిని కాల్చిన మేనమామ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చేపట్టినట్లు ముజఫర్ నగర్ పోలీసులు తెలిపారు. గన్ పనిచేస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం సరదగా చేయబోతే ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా సమాచారం.