హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మోస్ట్ పాపులర్ లీడర్ వైయస్సార్ అన్నారు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బుధవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..వైస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు భారత దేశ వ్యాప్తంగా పాలకుల అందరూ పాటిస్తున్నారన్నారు. వైయస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని..రైతులకు ,యువతకు, విద్యార్థులకు, మహిళలకు, వైయస్ రాజశేఖర్రెడ్డి ఒక ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేశారన్నారు ఉత్తమ్.
2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఆ విధంగా తాము కృషి చేస్తున్నామని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్ర రావు, మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, వంశీచంద్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ పలువురు నేతలు ఉన్నారు.