ఎన్నికలకు కాంగ్రెస్ ఎప్పుడూ భయపడదన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. విపక్షాలను ఇబ్బంది పెట్టడానికి TRS కుట్రపన్నుతోందని విమర్శించారు. రిజర్వేషన్ల విషయం తేల్చక ముందే మున్సిపాలిటీ ఎన్నికలకు టీఆర్ఎస్ ఎలా రెడీ అవుతుందన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. CAAపై సీఎం కేసీఆర్ తన అభిప్రాయాన్ని ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. CAA అమలు విషయంపై సీఎం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు ఉత్తమ్.