సెకండ్ వేవ్ ఉంటుందని మోడీ ముందే హెచ్చరించారు

సెకండ్ వేవ్ ఉంటుందని మోడీ ముందే హెచ్చరించారు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ గురించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ముందే అలర్ట్ చేసిందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. కరోనా రెండో వేవ్ తో జాగ్రత్తగా ఉండాలని, దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ముందే హెచ్చరించారని తెలిపారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. వచ్చే డిసెంబర్ నెలాఖరు నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకాను అందుబాటులోకి తీసుకొస్తామని నడ్డా స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన క్యాలెండర్ ను సిధ్ధం చేశామన్నారు.