హైదరాబాద్ సిటీ, వెలుగు: వెహికల్ ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రూ.43,57,406 ఆదాయం వచ్చినట్లు జేటీసీ రమేశ్ తెలిపారు.
టీజీ09జీ9999 నంబర్ను కీస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.18 లక్షలకు సొంతం చేసుకుంది. టీజీ09కే0006 నంబర్ను అనంత లక్ష్మీ కుమారి నామాల రూ.7,06,666కు దక్కించుకున్నారు. టీజీ09కే0005 నంబర్ను నేహా అగర్వాల్ రూ.1,89,001కు, టీజీ09జే9909 నంబర్ను సాయి వెంకట్ సునగ్ పాలడుగు రూ.1,44,999కు సొంతం చేసుకున్నారు. టీజీ09కే0009 నంబర్ను శ్రీనివాసా కన్స్ట్రక్షన్స్ రూ.1,00,000కు, టీజీ09కే0001 నంబర్ను ఇషానీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,00,000కు దక్కించుకున్నాయి.
