ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఇవాళ రాజ్యసభ వీడ్కోలు పలకనుంది. ఈ నెల 10న వెంకయ్య నాయుడి పదవి కాలం ముగియనుంది. రాజ్యసభ చైర్మన్ గా ఐదేళ్ల పాటు ఆయన నిర్వహించిన తీరుపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు వివిధ పార్టీల నేతలు, ఇతర సభ్యులు మాట్లాడనున్నారు. సాయంత్రం రాజ్యసభ సభ్యుల తరపున పార్లమెంట్ ఆవరణలో మరో వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వెంకయ్య నాయుడుకు ప్రధాని మోడీ జ్ఞాపికను అందించనున్నారు.
వెంకయ్య హయాంలో జరిగిన వివిధ కార్యక్రమాలతో కూడిన పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నారు. బీజేపీలోనే కాకుండా విపక్షాలు సైతం వెంకయ్య నాయుడి వ్యవహార శైలి,ఛలోక్తులు, ఆయన ప్రసంగాలను ఇష్టపడతారు. ఈ నెల 11న నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ బాధ్యతలు చేపట్టనున్నారు.