మూడోసారి సంక్రాంతి బరిలో వెంకీ, నాగ్.. రెండుసార్లు ఆ హీరోనే విన్నర్

మూడోసారి సంక్రాంతి బరిలో వెంకీ, నాగ్.. రెండుసార్లు ఆ హీరోనే విన్నర్

ఈ సంక్రాంతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ వార్ జరుగనుంది. ఒకరు కాదు ఏకంగా నాలుగురు స్టార్స్ హీరోలు బరిలో నిలుస్తున్నారు. ఈ సీజన్ లో ఎన్ని సినిమాలు వస్తున్నా.. అందరి చూపు ఇద్దరు హీరోలపైనే ఉన్నాయి. ఆ హీరోలు మరెవరో కాదు.. సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్. ఈ పండుగకు నాగార్జున నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సైంధవ్ మూవీతో వెంకటేష్ వస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

అయితే గతంలో కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు. మొత్తం రెండుసార్లు ఈ ఇద్దరి మధ్య సంక్రాంతి వార్ జరుగగా.. అందులో ఒక హీరో డామినేషన్ క్లియర్ గా కనిపించింది. ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. ఈ ఇద్దరు హీరోలు మొదటిసారి 1992 సంక్రాంతి బరిలో నిలిచారు. నాగార్జున కిల్లర్ సినిమా రిలీజ్ అవగా.. వెంకటేష్ చంటి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాల్లో చంటి బ్లాక్ బస్టర్ గా నిలువగా.. నాగార్జున కిల్లర్ మూవీ డీసెంట్ ఓ మోస్తారు విజయాన్ని సాధించింది.

ఇక రెండోసారి 1996 సంక్రాంతి వచ్చారు ఈ ఇద్దరు హీరోలు. నాగార్జున వజ్రంతో, వెంకటేష్ ధర్మ చక్రం సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ధర్మ చక్రం సూపర్ హిట్ అవగా.. వజ్రం అంతగా ఆడలేదు. అలా రెండు సార్లు నాగార్జునపై వెంకటేష్ డామినేషన్ క్లియర్ గా కనిపించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి వస్తున్నారు ఈ హీరోలు. మరి ఈసారి ఎవరు విజయాన్ని సాధిస్తారు అనేది ఉత్కంఠగా మారింది.