జూన్ 18 నుంచి గ్రూప్ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్: టీజీపీఎస్సీ

జూన్ 18 నుంచి గ్రూప్ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్: టీజీపీఎస్సీ
  • షార్ట్ లిస్ట్ విడుదల చేసిన టీజీపీఎస్సీ   

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల18 నుంచి ప్రారంభమై, జులై 8 వరకూ కొనసాగనుంది. దీనికోసం అభ్యర్థుల షార్ట్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో నిర్వహించనున్నట్టు ఈ మేరకు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 

ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి1.30 వరకూ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 వరకూ వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు. కాగా, షెడ్యూల్ సమయంలో అటెండ్ కాని వారి కోసం జులై 9న రిజర్వ్ డే ఉంటుంది. సర్టిఫికెట్‌‌ వెరిఫికేషన్‌‌కు హాజరు కావాల్సిన వారి షార్ట్ లిస్ట్ వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌‌సైట్‌‌లో ఉంచారు. షార్ట్ లిస్ట్ లో జనరల్ కేటగిరీలో 1,381 మంది, స్పోర్ట్స్ కోటాలో 81 మంది ఉన్నారు. 

16న గ్రూప్‌‌-1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌..

గ్రూప్ 1 అభ్యర్థులకు మూడో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల16న నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు విడతల వెరిఫికేషన్‌‌ ముగిసింది. ఈ క్రమంలో మరో 57 మందితో కూడిన షార్ట్ లిస్టును వెబ్ సైట్​లో పెట్టారు. 16న అటెండ్ కాని వారికి17న రిజర్వ్ డే ఉంటుందని అధికారులు తెలిపారు.