పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్న ప్రముఖ నటుడు అరుణ్ బాలి ఇక లేరు. 79 ఏళ్ల వయసులో ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అరుణ్ బాలికి ఆరోగ్యం బాగోలేదు. ఆయన మస్తీనియా గ్రావిస్ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. బాలి మృతి పట్ల బాలీవడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 3 ఇడియట్స్, కేదార్నాథ్, పానిపట్ వంటి చిత్రాలలో అరుణ్ బాలి కీరోల్ ప్లే చేశారు. చివరగా ఆయన అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బై చిత్రంలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 7న థియేటర్లలో విడుదలైంది. అరుణ్ బాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. వారు ఇండియాకు వచ్చాక బాలి అంత్యక్రియలు జరగనున్నాయి.