పొల్యూషన్ తగ్గించే బాధ్యత అందరిదీ

పొల్యూషన్ తగ్గించే బాధ్యత అందరిదీ
  • ఉప రాష్ట్రపతి వెంకయ్య

న్యూఢిల్లీ, వెలుగు: కార్బన్ ఎమిషన్స్ తగ్గించే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య సూచించారు. ఢిల్లీ, మెట్రో పాలిటన్ సిటీల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న ‘ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ  బ్రాంకస్ 2021’ రెండో వార్షిక సదస్సును ఆయన వర్చువల్ మోడ్ లో ప్రారంభించి మాట్లాడారు. కరోనా తర్వాత శ్వాసకోస వ్యవస్థ ప్రాధాన్యత ఏంటో ప్రజలకు తెలిసొచ్చిందన్నారు. పొగాకు వినియోగం ద్వారా పెరుగుతున్న ఊపిరితిత్తుల కేన్సర్, గొంతు కేన్సర్ వంటి సమస్యల విషయంలోనూ ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని వెంకయ్య పిలుపునిచ్చారు.