విక్టోరియా హోం

విక్టోరియా హోం

నిజాం ప్రభువు 16 ఎకరాల విస్తీర్ణంలో అనాథ పిల్లల కోసం విక్టోరియా మెమోరియల్​ హోం, ఇండస్ట్రియల్​ స్కూల్​ ఏర్పాటు చేశారు.  1902లో విక్టోరియా మహారాణి మరణానంతరం ఆమె పేరు మీదుగా ఒక మెమోరియల్​ హోంను స్థాపించాలనే ఉద్దేశంతో హైదరాబాద్​లో విక్టోరియా హోంను ఏర్పాటు చేశారు. ఆరో నిజాం మీర్ మహబూబ్​ అలీఖాన్​ 1896లో ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్​ ఎదురుగా ఉన్న ప్రదేశంలో తన విశ్రాంతి కోసం ఒక భవన నిర్మానాన్ని ప్రారంభించారు.

 కొంత భాగం నిర్మాణమైన తర్వాత భవనాన్ని పరిశీలించడానకి మీర్​ మహబూబ్​ అలీఖాన్​ వెళ్లిన సమయంలో ఏదో అశుభం జరిగిందని దానిని నిర్మాణాన్ని నిలిపివేయించారు. బ్రిటన్​ రాణి విక్టోరియా 1902లో మరణించిన అనంతరం హైదరాబాద్​లోని బ్రిటీష్​ రెసిడెంట్​ జనరల్​ సర్​ డేవిడ్​ బార్ ఆమె  స్మృత్యార్థం హైదరాబాద్​లో మెమోరియల్​ ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. 

ఈ విషయాన్ని మీర్​ మహబూబ్​ అలీఖాన్​కు తెలియజేయగా అసంపూర్తి నిర్మాణ భవనాన్ని పూర్తి చేయించి సర్ డేవిడ్​ బార్ కు అప్పగించారు. సర్​ డేవిడ్​ బార్​ వరంగల్​లో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాన్ని ఈ భవనంలోకి మార్చి 1905, జనవరి 1న విక్టోరియా మెమోరియల్​ హోం ఫర్​ ఆర్ఫన్స్​ అనే పేరును పెట్టారు.