నువ్వు నాకు నచ్చావు సీక్వెల్.. త్రివిక్రమ్ వెంటనే కథ రెడీ చేయండి?

నువ్వు నాకు నచ్చావు సీక్వెల్.. త్రివిక్రమ్ వెంటనే కథ రెడీ చేయండి?

నువ్వు నాకు నచ్చావు(Nuvvu Naaku Nachav).. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) సినీ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. కె విజయభాస్కర్ దర్శకతంలో 2001లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు కథ అందించింది మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే టీవీ లో వచ్చినా మిస్ అవకుండా చూసేవాళ్లు చాలా ఉండే ఉన్నారు. అంతలా ఆడియన్స్ మనసులను హత్తుకుంది ఈ సినిమా. అయితే దాదాపు 23 సంవత్సరాల తరువాత మరోసారి ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది నువ్వు నాకు నచ్చావు మూవీ. 

విక్టరీ వెంకటేష్ హీరోగా  వస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav). హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను(Shailesh Kolanu) తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నెక్స్ట్ లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా సైంధవ్ మూవీ టీమ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించున్నారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నువ్వు నాకు నచ్చావు సీక్వెల్ ఎప్పుడంటూ అడిగారు ఒక విలేకరి. దానికి సమాధానంగా వెకంటేష్ మాట్లాడుతూ.. మీరు వెంటనే త్రివిక్రమ్ కు కథ రాయమని చెప్పండి.. అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నువ్వు నాకు నచ్చావు మూవీ సీక్వెల్ తెరపైకి వచ్చింది. 

వెంకటేష్ చేసిన కామెంట్స్ కు ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు.. మీరు నువ్వు నాకు నచ్చావు సీక్వెల్ ప్లాన్ చేయండి సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సైంధవ్ సినిమా విషయానికి వస్తే.. వెంక‌టేష్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ తో, తొలి పాన్ ఇండియా మూవీగా రానుంది ఈ సినిమా. శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శ‌ర్మ‌, ఆండ్రియా, తమిళ హీరో సూర్య కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ న‌వాజుద్దీన్ సిద్ధికీ విల‌న్‌గా న‌టిస్తున్నారు. టీజర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధించనుందో చూడాలి మరి.