బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పక్కా కలిసిపోతయి

బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పక్కా కలిసిపోతయి
  • బీజేపీ నేత విజయశాంతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందైనా లేదా తర్వాతైనా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కచ్చితంగా కలిసిపోతాయని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. వాటి మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతుందన్నారు.  ఈ మూడు పార్టీలు ఒక వైపు, బీజేపీ ఒక్కటే మరోవైపు ఉంటుందని బుధవారం ఆమె ట్వీట్ చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి వెళ్తారని మీడియాలో ప్రచారం జరుగుతుందని.. ఆవేశంగా ఉన్న కొన్ని సందర్భాల్లో  ఇలాంటి నిర్ణయాలు బయటపడతాయన్నారు. బీజేపీ లాంటి పెద్ద పార్టీలో ఇలాంటి అంశాలు సాధారణమేనన్నారు. కొన్ని సందర్భాల్లో బీజేపీ ధోరణిలో ఉండేవాళ్లు కాంగ్రెస్​లో ఉండలేరని.. అలాగే, కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్లు కూడా బీజేపీలో ఇమడలేకపోవచ్చన్నారు.