మీ సినిమాలు చూస్తే ధైర్యం వస్తుంది

మీ సినిమాలు చూస్తే ధైర్యం వస్తుంది

మహిళలకు మోడీ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందన్నారు బీజేపీ నేత విజయశాంతి. బిజెపి స్టేట్ ఆఫీస్ లో మహిళ మోర్చ అధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా విజయశాంతి హాజరయ్యారు. జీహెచ్ఎంసీ వర్కర్లను సత్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడిన విజయశాంతి .. పారిశుద్ధ్య కార్మికులు సమాజంలో చెడుని కూడా క్లీన్ చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరటంలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు  మేలు జరుగుతుందన్నారు.

జీహెచ్ఎంసీ కార్మికులు కాసేపు విజయశాంతితో  మాట్లాడారు. ఒసేయ్ రాములమ్మ సినిమా నాలుగు సార్లు చూశామని పారుశుధ్య కార్మికులు అన్నారు. ఇంకా ఏయే సినిమాలు చూశారని అడిగారు విజయశాంతి.. చాలా సినిమాలు చూశామని కార్మికులు చెప్పారు. మీ సినిమాలు చూస్తే ధైర్యం వస్తోందని విజయశాంతికి చెప్పారు మున్సిపల్ కార్మికలు.