అమెరికా రోడ్డు ప్రమాదంలో వికారాబాద్‌ వాసి మృతి

అమెరికా రోడ్డు ప్రమాదంలో వికారాబాద్‌ వాసి మృతి

వికారాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్‌ కి చెందిన నిఖిల్‌(35) మృతి చెందాడు. వికారాబాద్‌, గంగారం ప్రాంతానికి చెందిన వినోద్‌ కుమార్, హిమజ్యోతి దంపతుల కుమారుడు నిఖిల్‌ అమెరికాలోని టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పది రోజుల క్రితం కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌ వెళ్తుండగా న్యూ మెక్సికో రహదారిలో ఎదురుగా రాంగ్‌ రూట్‌ వచ్చిన మరో వాహనం ఇతడి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. గురువారం తెల్లవారుజామున ఉదయం నిఖిల్‌ మృతదేహం వికారాబాద్‌ చేరుకుంటుందని తెలిపారు కుటుంబ సభ్యులు.