ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఒక్క పోస్ట్‌తో కోటీ 21 లక్షల ఆదాయం

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఒక్క పోస్ట్‌తో కోటీ 21 లక్షల ఆదాయం

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో విరాట్‌‌ సంపాదన

లండన్‌‌: ఆటలోనే కాదు.. ఆర్జనలోనూ టీమిండియా విరాట్‌‌ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. ఫోర్బ్స్‌‌ రిచ్చెస్ట్‌‌ అథ్లెట్ల జాబితాలో చోటు సంపాదించిన విరాట్‌‌.. మరో ఘనతను కూడా సాధించాడు. లాక్‌‌డౌన్‌‌ కాలంలో ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో స్పాన్సర్డ్‌‌ పోస్ట్‌‌ల ద్వారా అత్యధికంగా ఆర్జించిన ఏకైక క్రికెటర్‌‌గా నిలిచాడు. మార్చి 12 నుంచి మే 14 వరకు సేకరించిన డాటా ప్రకారం విరాట్‌‌ ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ పీరియడ్‌‌లో స్పాన్సర్డ్‌‌ పోస్ట్‌‌ల ద్వారా కోహ్లీ రూ. 3 కోట్ల 63 లక్షలు సంపాదించాడు. అంటే ఒక్క పోస్ట్‌‌ విలువ రూ. 1 కోటీ 21 లక్షలు అన్నమాట. పోర్చుగల్‌‌ ఫుట్‌‌బాలర్‌‌  క్రిస్టియానో రొనాల్డో రూ. 17 కోట్ల 24 లక్షలతో టాప్‌‌లో కొనసాగుతున్నాడు. అర్జెంటీనా సూపర్‌‌ స్టార్‌‌ లియోనల్‌‌ మెస్సీ (రూ. 11.50 కోట్లు), నెయ్‌‌మార్‌‌ (రూ. 10. 53 కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బాస్కెట్‌‌బాల్‌‌ గ్రేట్‌‌ షాక్విలి ఓ నీల్‌‌ (రూ. 5.58 కోట్లు), ఇంగ్లండ్‌‌ ఫుట్‌‌బాల్‌‌ మాజీ కెప్టెన్‌‌ బెక్‌‌హామ్‌‌ (రూ. 3.88కోట్లు) టాప్‌‌–5లో ఉన్నారు.

ఫుట్‌‌బాల్‌‌లో తొలి బిలియనీర్‌‌

క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌‌బాల్‌‌లో తొలి బిలియనీర్‌‌గా అవతరించాడు. టీమ్‌‌ స్పోర్ట్స్‌‌లో ఈ ఘనత సాధించిన తొలి ఫుట్‌‌బాలర్‌‌గా రికార్డులకెక్కాడు. ప్లేయర్‌‌గా ఉన్నప్పుడే బిలియన్‌‌ డాలర్ల క్లబ్‌‌లో చేరిన మూడో ఆటగాడతను. గతంలో గోల్ఫ్‌‌ స్టార్‌‌ టైగర్‌‌ వుడ్స్‌‌, బాక్సర్‌‌ ఫ్లాయిడ్‌‌ మేవెదర్‌‌ ఈ ఫీట్‌‌ను సాధించారు. గతేడాది రొనాల్డో సంపాదన రూ. 793 కోట్లు కాగా, 17 ఏళ్ల కెరీర్‌‌లో మ్యాచ్‌‌ ఫీజుల కింద రూ. 4909 కోట్లు అందుకున్నాడు. 2022 జూన్‌‌లో తన కాంట్రాక్ట్‌‌ ముగిసే సమయానికి ఈ మొత్తం రూ. 5778 కోట్లకు చేరుకుంటుకుందని అంచనా.

For More News..

ఎగ్జామ్​ సెంటర్​లో వడ్ల బస్తాలు

50 ప్లేట్ల పూరీ ఆర్డర్ ఇచ్చి రూ.25 వేలు కొట్టేసిన్రు

ఈసారి బోనాల పండుగ లేనట్లే