విజ్డెన్ డెకేడ్ టీ20 టీమ్లో కోహ్లీ, బుమ్రా

విజ్డెన్ డెకేడ్ టీ20 టీమ్లో  కోహ్లీ, బుమ్రా

లండన్‌‌‌‌:  టీమిండియా కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా విజ్డెన్‌‌‌‌ ప్రకటించిన ఈ దశాబ్దపు ఇంటర్నేషనల్‌‌‌‌ టీ20 టీమ్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ సంపాదించారు.అయితే, ఇండియాకు తొలి టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ అందించిన మహేంద్ర సింగ్‌‌‌‌ ధోనీ మాత్రం ఈ టీమ్‌‌‌‌కు సెలెక్ట్‌‌‌‌ కాలేదు. ఆస్ట్రేలియా లిమిటెడ్​ ఓవర్ల కెప్టెన్‌‌‌‌ ఆరోన్‌‌‌‌ ఫించ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా ఎంపికైన జట్టులో షేన్‌‌‌‌ వాట్సన్‌‌‌‌, గ్లెన్‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌కు కూడా అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌‌‌‌ నుంచి జోస్‌‌‌‌ బట్లర్‌‌‌‌, డేవిడ్‌‌‌‌ విల్లే.. అఫ్గానిస్థాన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్లు మహమ్మద్‌‌‌‌ నబీ, రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ కొలిన్‌‌‌‌ మన్రో, శ్రీలంక లెజెండ్‌‌‌‌ లసిత్‌‌‌‌ మలింగ కూడా చోటు దక్కించుకున్నారు. డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో కోహ్లీ రికార్డు అంత బాగాలేకున్నా.. ఇంటర్నేషనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో అతని యావరేట్‌‌‌‌ 53గా ఉందని విజ్డెన్‌‌‌‌ చెప్పింది. నిలకడగా ఆడడం వల్ల స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ పేస్‌‌‌‌, స్పిన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు వికెట్ల మధ్య మెరుపు వేగంతో రన్నింగ్‌‌‌‌ చేసే విరాట్‌‌‌‌ మూడో నంబర్‌‌‌‌కు సరైన ఆటగాడని తెలిపింది. అద్భుతమైన ఎకానమీ రేట్‌‌‌‌తో పాటు డెత్‌‌‌‌ ఓవర్లలో నమ్మదగ్గ బౌలర్‌‌‌‌ కావడంతో బుమ్రాను జట్టులోకి తీసుకున్నట్టు చెప్పింది.

విజ్డెన్‌‌‌‌ టీ20 టీమ్‌‌‌‌

ఆరోన్‌‌‌‌ ఫించ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), కొనిల్‌‌‌‌ మన్రో, విరాట్‌‌‌‌ కోహ్లీ, షేన్‌‌‌‌ వాట్సన్‌‌‌‌, గ్లెన్‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, జోస్‌‌‌‌ బట్లర్‌‌‌‌, మహమ్మద్‌‌‌‌ నబీ, డేవిడ్‌‌‌‌ విల్లే, రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా, లసిత్‌‌‌‌ మలింగ.