మొదటి డే నైట్ టెస్టు మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామన్నాడు టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ. రేపు జరగనున్న డేనైట్ టెస్టు మ్యాచ్ పై కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. పింక్ బాల్ తో జరిగే ఈ మ్యాచ్ ను తాము ఓ ఛాలెంజ్ గా తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ మ్యాచ్ తమకు మైలురాయి లాంటి మ్యాచ్ అని..నెట్స్ లో చాలా ప్రాక్టీస్ చేశామన్నాడు. ఈ టెస్టు మ్యాచ్ అభిమానులకు వినోదాన్ని పంచుతుందన్నాడు. టీమిండియా అద్భుతంగా రాణిస్తుందని.. ఈ టెస్టును సవాల్ గా తీసుకుని గెలుపుతో ముగిస్తామన్నాడు కోహ్లీ.
అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న డేనైట్ టెస్ట్ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో 22 న మొదలు కానుంది. భారత్ బంగ్లాతో జరగనున్న ఈ మ్యాచ్ కు పలువురు ప్రముఖ క్రికెటర్లు హాజరుకానున్నారు.
Virat Kohli on India's first day-night Test match at the Eden Gardens in Kolkata tomorrow: This pink ball Test match is a challenge for us. It is very exciting for us as the energy will be very high. It is a landmark occasion. pic.twitter.com/3l6He0vWfO
— ANI (@ANI) November 21, 2019

