ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్యైన బాలీవుడ్ భామ అనుష్క 2019 ఇయర్ ఎండ్ని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. విరుష్క జంట ప్రస్తుతం వింటర్ వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ వారు మంచుతో నిండిన జిస్టాద్ పట్టణంలో గడుపుతున్నారు. అక్కడ వారిద్దరు దిగిన ఫోటోలను విరాట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. 2019లో పలు రికార్డులు సృష్టించిన విరాట్ ఈ విరామ సమయాన్ని తన భార్య అనుష్కతో గడపాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్గా పెళ్లి రోజు జరుపుకున్న ఈ జంట.. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు ఇక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య, కూతురుతో కలిసి ముంబాయిలోని వండర్ లాండ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆఫ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అయితే క్రిస్మస్ టైం విత్ హోం మినిస్టర్ ఇన్ వెస్ట్ మినిస్టర్ అని తన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. వీరంతా శ్రీలంకతో జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే మూడు T20 మ్యాచ్ల సిరీస్లో తిరిగి జాయిన్ అవుతారు.
For More News…