వందేళ్ల వెండితెరలో.. 90 ఏళ్ల బంగారు దర్శకుడి కథ

వందేళ్ల వెండితెరలో.. 90 ఏళ్ల బంగారు దర్శకుడి కథ

కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ జీవితాధారంగా తెరకెక్కిన సినిమా ‘విశ్వ దర్శనం’. జనార్థన మహర్షి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ను మంగళవారం విడుదల చేశారు. ‘వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుడి కథ’ అన్న డైలాగ్‌ తో టీజర్‌ మొదలైంది. రాధికా శరత్‌కుమార్‌, సుశీల, భానుప్రియ, ఆమని, శైలజ, విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు విశ్వనాథ్‌ గొప్పతనం గురించి టీజర్‌ లో వివరించారు.

విశ్వనాథ్‌ కు సంబంధించిన అలనాటి ఫొటోలను టీజర్‌ లో చక్కగా చూపించారు. ‘సినిమా అనే ఓ బస్సును పట్టుకుని, సినిమా చూసేవారు ప్రేక్షకులు భక్తులు అనుకుని నేను బస్సు నడిపే డ్రైవర్‌ ను. ఏం చేయాలి నేను?’ అంటూ చివర్లో విశ్వనాథ్‌ చెప్పే డైలాగ్ హైలైట్‌ గా నిలిచింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్‌ ప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.