పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ 

పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ 

హైద‌రాబాద్: ప్రధాని మోడీ పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారన్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. బోరబండలోని రాజీవ్ గాంధీనగర్ లో స్వచ్ఛ భారత్ తెలంగాణ చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు.  ఈ హెల్త్ క్యాంపుకు ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడిన‌ వివేక్ వెంకటస్వామి..  మెడికల్ క్యాంపు పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సేవా భారతి ద్వారా లాక్ డౌన్ సమయంలో బీజేపీ నేతలు ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారని తెలిపారు. ప్రధాని మోడీ పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చార ని.. దీనిలో 5లక్షల వరకు వైద్య ఖర్చులు వాడుకోవచ్చని తెలిపారు.  5 నుంచి 10 లక్షలకు పెంచాలని ప్రధాని మోడీని కలిసి కోరుతామన్నారు. ఈ హెల్త్ క్యాంపులో రోగులకు ఫ్రీ చెకప్, మెడిసిన్ తో పాటు కరోనా వాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు నిర్వాహ‌కులు.