
ముంబై: ఆలిండియా జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా వీఎస్ తిలక్ నాయుడును క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నియమించింది. విమెన్స్ నేషనల్ సెలక్షన్ ప్యానెల్లో మితు ముఖర్జీ పదవీకాలం ముగియడంతో ఆమె స్థానాన్ని శ్యామ డే షాతో భర్తీ చేసిందని బోర్డు సెక్రటరీ జై షా సోమవారం ప్రకటించారు. నీతూ డేవిడ్ చైర్ పర్సన్గా ఉన్న విమెన్స్ సెలక్షన్ ప్యానెల్లో రేణు మార్గరేట్, ఆరతి వైద్య, కల్పన, శ్యామ డే షా సెలక్టర్లుగా ఉన్నారు. జూనియర్ క్రికెట్ కమిటీలో తిలక్ నాయుడు (చైర్మన్)తో పాటు రణదేవ్ బోస్, హర్వీందర్ సింగ్, పతిక్ పటేల్, కృషేన్ మోహన్ పని చేస్తున్నారు. మాజీ వికెట్ కీపర్ అయిన తిలక్ నాయుడు కర్నాటక తరఫున 93 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 4 వేల పైచిలుకు రన్స్ చేశాడు.