భారీ వర్షాలకు కూలిన గోడ.. తొమ్మిది మంది మృతి

భారీ వర్షాలకు కూలిన గోడ.. తొమ్మిది మంది మృతి

ఉత్తరప్రదేశ్ లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. దిల్ కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగోడ కూలి తొమ్మిది మంది చనిపోయారు.  మరో ఇద్దరికి తీవ్ర గాయాాలయ్యాయి.  మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అధికారులు స్థానికుల సాయంతో స్పాట్ లో సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు.

ఎడతెరిపిలేని వర్షాల వల్లే గోడకూలిందని.. ఆ గోడ పక్కనే గుడిసెలో నివసిస్తున్న 9 మంది చనిపోయారన్నారు.  ఈ ప్రమాదంపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.. మృతుల  కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. దీంతో పాటు గాయపడిన వారికి ఫ్రీ ట్రీట్మెంట్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు.