- పెద్ది ప్యామిలీని కంటికి రెప్పలా కాపాడుకుంటాం : కేటీఆర్, హరీశ్ రావు
వరంగల్/నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కాగానే నర్సంపేట మెడికల్కాలేజీకి పెద్ది సుదర్శన్రెడ్డి పేరు పెడుతామని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ చెప్పారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో సోమవారం నిర్వహించిన పెద్ది సుదర్శన్రెడ్డి దశదిన కార్యక్రమానికి హరీశ్రావుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ముందుగా సుదర్శన్ రెడ్డి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం జరిగిన సంతాప సభలో కేటీఆర్మాట్లాడుతూ వరంగల్జిల్లాలో ఉద్యమాలకు నాయకత్వం వహించిన సుదర్శన్రెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉన్నారన్నారు. ఉద్యమంతో పాటు నర్సంపేట అభివృద్ధికి సుదర్శన్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. కేసీఆర్నాయకత్వంలో తెలంగాణ వచ్చే వరకు, వచ్చిన తర్వాత పెద్ది సుదర్శన్రెడ్డి చేసిన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు.
సుదర్శన్ రెడ్డి ప్రజల మనిషి : హరీశ్ రావు
పెద్ది సుదర్శన్రెడ్డి విద్యార్థి దశ నుంచి తుది శ్వాస వరకు ఉద్యమాలు, పోరాటాలే ఏజెండాగా ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు. నర్సంపేటకు మెడికల్కాలేజీ, పాకాలకు గోదావరి జలాలను తేవడానికి ఎంతో కృషి చేశారన్నారు.
సభలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, బానోతు శంకర్నాయక్, సతీశ్ బాబు, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
