- సిటీలో ఒక్కసారిగా పడిన వాన
- ట్రాఫిక్ జామ్తో వాహనదారులకు ఇబ్బందులు
సికింద్రాబాద్, వెలుగు: సిటీలో బుధవారం రాత్రి 9. 30 గంటల నుంచి సుమారు 45 నిమిషాల పాటు పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్లో 3.5 సెం.మీ, చందానగర్లో 1.3సెం.మీల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, జవహర్నగర్, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ముషీరాబాద్, ఉప్పల్, హబ్సిగూడ, మల్లాపూర్, సుచిత్ర, సనత్ నగర్, కూకట్పల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది.
దీంతో రోడ్లపై వరదనీరు చేరగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.