నల్గొండను బంగారు తునక చేస్తన్నవ్.. ఏమైంది కేసీఆర్?

నల్గొండను బంగారు తునక చేస్తన్నవ్.. ఏమైంది కేసీఆర్?

నల్గొండ: కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పి రెండేళ్లు అయ్యిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డిసెంబర్ 03, 2018న గత అసెంబ్లీ ఎన్నికల సభలో కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పారని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. డిసెంబర్ 3ను జూటా దినంగా పాటించాలన్నారు.

టీఆర్ఎస్‌‌ను గెలిపిస్తే నల్గొండను బంగారు తునకలాగా చేస్తానని చెప్పారని.. బంగారు తునక చతికిల పడిందన్నారు. అభివృద్ధి మాట దేవుడెరుగు.. నల్గొండలో కనీస మౌలిక సదుపాయాలు తీర్చలేకపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పిన విధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయకపోతే, బీజేపీ ఆందోళనల ద్వారా పోరాటాలకు సిద్ధమవుతుందన్నారు. నల్గొండలో అభివృద్ధి జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.