ఎడ్లను కడుగుతూ నీట మునిగి ఇద్దరు రైతులు మృతి

ఎడ్లను కడుగుతూ నీట మునిగి ఇద్దరు రైతులు మృతి
  • నిర్మల్ జిల్లా కల్యాణి గ్రామంలో ఘటన

భైంసా, వెలుగు: చెరువులో దిగి ఎడ్లను కడుగుతుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి నిర్మల్​జిల్లాలో ఇద్దరు రైతులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తానూర్​మండలం కల్యాణి గ్రామానికి చెందిన గౌతమ్(47), సచిన్(21) రైతులు. బుధవారం మధ్యాహ్నం తమ ఎడ్లను గ్రామ సమీపంలోని మసల్గ చెరువుకు తీసుకెళ్లారు. చెరువులో దిగి వాటిని కడుగుతుండగా గౌతమ్ ప్రమాదవశాత్తు నీట మునిగాడు. కాపాడేందుకు ప్రయత్నించిన సచిన్ కూడా మునిగిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కాపాడేందుకు ట్రై చేసినా అప్పటికే ఇద్దరూ చనిపోయారు. సచిన్​కు ఆరు నెలల కిందే వివాహం జరిగింది. ముథోల్​సీఐ వినోద్, ఎస్సై శివరామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు ఫైల్​చేశారు.